telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? విజయసాయిరెడ్డి సెటైర్

vijayasaireddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. “మౌనవ్రతంలో గాని ఉన్నారా బాబు గారూ? ఎప్పటిలాగే అజ్ఞాత మిత్రులు అండగా ఉంటారు. ధైర్యం కోల్పోకూడదని సెల్ఫ్ హిప్నాటిజం లాంటిదేమైనా చేసుకుంటున్నారా! ఒక్కో ఊతకర్ర జారుతుంటే భయం పట్టుకుందా? కొత్త దారులు వెతుక్కునే పనిలో పడ్డారా? ఎంతైనా మాస్టర్ మేనిప్యులేటర్ కదా!” అంటూ చురకలు అంటించారు.

కాగా.. అంతకు ముందు “బాబు అను’కుల మీడియా దేశ ప్రజల ముందు లక్షోసారి అడ్డంగా దొరికి పోయింది. జాతీయ మీడియా హెడ్ లైన్స్ లో రాసిన వార్తను జాతి మీడియా ముసుగేసి దాచాలని చూసింది. సోషల్ మీడియా ఊరుకుంటుందా. పచ్చపాతాన్ని ఉతికి ఆరేసింది. మా కోడి కూస్తేనే తెల్లారుతుందనే భ్రమలు వీడక తప్పదు.”అని పేర్కొన్నారు.  “జగనన్న విద్యాకానుక పేరుతో పేదలపై ఉన్న కడుపుమంటను కక్కేస్తున్నారు పచ్చనేతలు. పార్టీ రంగులున్నాయని కొందరు, టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు. హై క్వాలిటీ కిట్ లను అందించడంతో ఇక చేసేదిలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో పాతికేళ్లు ఈ ఏడుపు ఏడుస్తూనే ఉండండి.” ఎద్దేవా చేసారు.

Related posts