telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించాలి: చంద్రబాబు

chandrababu

ఏపీలో కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మనో వేదనతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసును కలచివేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఐదు నెలలుగా పనులు లేక, కుటుంబాలు పస్తులు ఉండడం చూడలేకసెల్ఫీ వీడియోల్లో.. ఆత్మహత్యలే తమకిక శరణ్యమంటూ వారు పేర్కొనడం చూసైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

తన కుటుంబాన్ని పోషించలేకపోతున్నానంటూ ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియోను చంద్రబాబు పోస్ట్ చేశారు. తన పరిస్థితులు బాగోలేవని, పని దొరకడం లేదని అందులో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని, తనను క్షమించాలని ఆ వీడియోలో అతడు తన కుటుంబ సభ్యులను కోరాడు.

Related posts