జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఓ కసాయి కొడుకు ఇనుపరాడ్తో దాడి చేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పారగణ జిల్లాలో చోటు చేసుకుంది. సునీల్ సాహా(65), షేఫ్హలీ సాహా(60) తల్లిదండ్రులకు అమిత్ సాహా(36) అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి పెళ్లి అయిన కొన్ని రోజులకే భార్య నుంచి విడాకులు కూడా తీసుకున్నాడు. అయితే అప్పట్నుంచి అమిత్ ప్రవర్తన వింతగా ఉండేది. అతడు నాడీ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో అతను ఏం చేసేవాడో అతనికే తెలియకుండా ఉండేది. రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులపై ఇనుపరాడ్తో దాడి చేసి హత్య చేశాడు. ఇద్దరు వృద్ధులు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అమిత్ను అరెస్టు చేశారు.