కులమతాలకతీతంగా అన్ని వర్గాలకు వైఎస్ఆర్ మేలు చేశారని వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం వైసీపీ తరపున మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. అన్ని సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అద్భుతంగా అమలు చేశారని గుర్తు చేశారు.
రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలని చెప్పారు. వైఎస్ఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. అమరావతిని అమెరికా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తానని చంద్రబాబు మాయ మాటలు చెప్పారని విమర్శించారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.