*బెంగళూరు వేదికగా కేసీఆర్ సంచలన కామెంట్స్..
* రెండు, మూడు నెలల్లో ఓ సంచలన వార్త చెప్తా
*కేంద్రంలో మార్పు వస్తేనే దేశం గతిలో మార్పు వస్తుంది..
*ఈసారి దేశంలో జాతీయస్థాయిలో మార్పు వస్తుంది..దాన్ని ఎవరూ ఆపలేరు
*మార్పు కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత
*దేశానికి అద్వితీయమైన సమగ్ర పాలన అవసరం..
దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. రెండు, మూడు నెలల్లో ఓ సంచలన వార్త చెబుతా అని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమని, దాన్ని ఎవరూ ఆపలేరని కేసీఆర్ వెల్లడించారు. యువకులు మేదావులు మార్పు కోరుకుంటున్నారని , దేశాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని..చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోయిందని అన్నారు. జీడీపీలో భారత్ చైనా అధిగమించదని, సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్ధికశక్తిగా భారత్ను తీర్చిదిద్దొని చెప్పారు.
కర్ణాటక బెంగళూరులోని మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో సుమారు మూడు గంటల పాటు భేటీ అయిన కేసీఆర్.. పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ రాజకీయాలతో పాటు కర్ణాటక రాజకీయాలపై కూడా చర్చించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం దేనికైనా తెగిస్తుంది: జేసీ దివాకర్ రెడ్డి