మాస్ మహరాజ్ రవి తేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రజీషా, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రవితేజ డిప్యూటీ కలెక్టర్గా కనిపించనున్న ఈ మూవీతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ సినిమా జూన్ 17న విడుదలవుతున్నట్లు గతంలో ప్రకటించారు.
అయితే తాజాగా నిర్మాణాంత కార్యక్రమాలు పూర్తి కానందున సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మంచి అవుట్పుట్ రావాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని చెప్పారు. కొత్త రిలీజ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
కీర్తి సురేష్ తాజా లుక్ పై వర్మ కామెంట్స్