telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీశైలం డ్యాం కి .. మరమ్మతులు అత్యవసరం.. : రాజేంద్రసింగ్

srisailam project with full of water

శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడిందని, మరమ్మతులు చేయకపోతే విషాదం తప్పదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఏదైనా విపత్తు జరిగితే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించాక వాటి నిర్వహణ గురించి సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. డ్యాం సమీపంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, త్వరితగతిన ప్రభుత్వం చర్యలు చేపడితే కనుక డ్యాంను రక్షించుకోగల్గుతామని సూచించారు.

గంగాజల్ సాక్షరత్ యాత్రలోదేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని శ్రీశైలం డ్యాంను నిన్న ఆయన సందర్శించారు.

Related posts