జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 49 మంది జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పాక్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ హై కమిషనర్ సోహేల్ మహమూద్కు ఈ రోజు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మాద్పై పాక్ వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవాలని పాక్ రాయబారిని భారత్ ఆదేశించింది. పాక్ నేలపై నుంచి సాగుతున్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలౌ చేపట్టాలని కోరింది. పుల్వామా దాడిపై గురువారం పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి ఖండించారు.