telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఈ ఏడాది నుంచి ఓయూసెట్ ఆన్ లైన్ లో : వీసీ

OU Cet Exam in Online VC Ramachandram

ఈ ఏడాది నుంచి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)సెట్ ను ఆన్ లైన్ లో నిర్వహిస్తామని వీసీ రామచంద్రం తెలిపారు. ఈరోజు ఓయూలో మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని కోర్సులకు ఆన్ లైన్ మూల్యాంకనం వర్తింపజేస్తామన్నారు. రికార్డ్స్ అన్నింటినీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఫ్యాకల్టీ ఇన్ ప్రమోషన్ సిస్టమ్ ను ప్రారంభిస్తామన్నారు.

రీసెర్చ్, ఇన్నోవేషన్ ను మరింత ప్రోత్సాహిస్తామని ప్రకటించారు.యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో పీ హెచ్ డీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు తమ హాస్టళ్లను ఖాళీ చేయాలని వీసీ ఆదేశించారు. నాన్ బోర్డర్స్ హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత క్యాంపస్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పలు నూతన భవనాలు నిర్మిస్తున్నామని వీసీ తెలిపారు.

Related posts