పంచాయితీరాజ్ చట్టం వచ్చాక గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయని తెలంగాణ మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు పుష్కలంగా నిధులు ఇచ్చామని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకెళ్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రజల ఆశీర్వాదంతో మున్నిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారన్నారు. రాష్ట్రంలో పల్లెలు బాగుండాలన్న లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్నిచేపట్టి విజయవంతం చేశామని తెలిపారు. తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా చుపడుతున్నామని అన్నారు. పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.