హైద్రాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని కాపాడండని వైద్యులు ఆందోళనకు దిగారు. కూలిపోతున్న భవనాన్ని కూల్చవద్దు అంటూ అడ్డుపడటం అవివేకమని వైద్యులు అన్నారు. ప్రాణాలు నిలబెట్టడానికి దీనిని కట్టారని అన్నారు. కానీ అది కూలి ప్రాణాలు తీసేలా ఉందని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని కట్టాలని డిమాండ్ చేశారు. కూలిపోతున్న బిల్డింగ్ను కూల్చవద్దు అంటూ కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
2015లో సీఎం కేసీఆర్ పరిశీలించి కొత్త బిల్డింగ్ నిర్మించడానికి అధికారాలకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కానీ కొంత మంది అడ్డుకున్నారని మండిపడ్డారు. కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం సరైనది కాదన్నారు వైద్యులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి అడ్డు పడితే సహించేది లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.