తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నగరంలోని ప్రగతిభవన్ వద్ద ఈరోజు విపక్షాలు నిరసన చేపట్టనున్నారు. ‘ముఖ్యమంత్రి మేలుకో..ప్రజలను కాపాడు’ అనే నినాదంతో నేతలు నిరసన చేయనున్నారు.
ఈ నిరసనలో టీజేఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు, ప్రజాసంఘాలు పాల్గొననున్నారు. కరోనా పరీక్షలు, చికిత్సను ఉచితంగా ప్రభుత్వమే అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతు దారుల విజయం ఖాయం…