telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పరుచూరి వెంకటేశ్వరా రావుకు చిరంజీవి పరామర్శ

Paruchuri

ప్ర‌ముఖ టాలీవుడ్ ర‌చ‌యిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) కన్నుమూశారు. ఈ రోజు (శుక్ర‌వారం) తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియ‌ జేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరుచూరికి చిరంజీవి ఫోన్ చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, వ్యక్తిగతంగా పరుచూరి తనకు ఎంతో ఆప్తుడని, ఆయనతో తనకు చాలా అనుబంధం ఉందని చెప్పారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.

Related posts