telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తండ్రీకొడుకులిద్దరూ రాజకీయంగా గల్లంతవుతారు : విజయసాయిరెడ‌్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. విగ్రహాల ధ్వంసంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ టెంపుల్స్ డిమాలిషన్’కు స్కెచ్‌ వేసి అడ్డంగా చంద్రబాబు దొరికిపోయాడంటూ ట్విట్టర్‌ వేదికంగా ఫైర్‌ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. “అధికారంలో లేనప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టడం బాబుకు అలవాటే. గతంలో బంద్ లు, నిరసనలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా ఎన్ని బస్సులు తగలబెట్టాలో జిల్లాల వారిగా టార్గెట్లిచ్చేవాడని సొంత మనుషులే బయటపెట్టారు. ఇప్పుడు ‘ఆపరేషన్ టెంపుల్స్ డిమాలిషన్’కు సేమ్ స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు. మాలోకాన్ని అందరికీ ఆమోదయోగ్యుడిగా తీర్చిదిద్దాలంటే ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. వాళ్ల మనసులు గెలవాలి. విగ్రహాలను ధ్వంసం చేసి ప్రజల మధ్య అడ్డు గోడలు కడితే పోలీసులకు దొరికిపోతారు. తండ్రీకొడుకులిద్దరూ రాజకీయంగా గల్లంతవుతారు. ” అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Related posts