telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ షాట్ నేను ఆడలేను : పుజారా

ఐపీఎల్ 2021 కోసం ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్..‌ పుజారాను అతని కనీస ధర రూ.50 లక్షలకు కొనుగోలుచేసింది. దీంతో టీ20 ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకుని ఐపీఎల్‌-14 సీజన్‌లో రాణించాలని ఎదురుచూస్తున్నాడు. ఇక ఏప్రిల్‌10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగునున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ తుది జట్టులో పుజారాకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఇక తాజాగా పుజారా మాట్లాడుతూ… ‘రివర్ప్‌ స్కూప్‌ షాట్ల ఆడటంలో రిషబ్ పంత్‌ ఓ ప్రత్యేకం. పంత్‌ తరహాలో రివర్స్‌ స్కూప్‌ ఆడటం నా వల్ల కానేకాదు. అది ఎప్పటికీ జరగదు కూడా. పంత్‌ ఒక ఫియర్‌లెస్‌ క్రికెటర్‌. అందుకే ఆ షాట్లను ఈజీగా ఆడుతున్నాడు. పంత్‌ ఆడే ఆ షాట్లను నేను ఆడలేను’ అని అన్నాడు. ‘కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ రివర్స్‌ స్కూప్‌ ఆడటం కష్టమనే నేను అనుకుంటా. నేను స్కూప్‌ షాట్లను భయంలేకుండా ఆడతా.. కానీ రివర్స్‌ స్కూప్‌ షాట్లను ఆడను. థర్డ్‌ మ్యాన్‌ పై నుంచి ఆడే ఆ షాట్లతో చాలా రిస్క్‌. ఆ షాట్లు ఆడటంలో రిషబ్ పంత్‌కు అరుదైన టెక్నిక్‌ ఉందనే చెప్పాలి. పదేపదే ఆ షాట్లను ఆడమన్నా.. పంత్‌కు ఆ సత్తా ఉంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు ఆ షాట్లు ఆడుతుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నవాళ్లమంతా షాక్‌ అయ్యాం’ అని పుజారా పేర్కొన్నాడు.

Related posts