telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. గత టీడీపీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని, తాను అదే పని చేస్తే టీడీపీలో ఎవరూ మిగలరంటూ అసెంబ్లీలోజగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు.

1975లో తాను వైయస్ రాజశేఖరరెడ్డి ఇద్దరం ఒకేసారి శాసనసభకు ఎన్నికయ్యామని, రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజశేఖరరెడ్డి నాలుగు రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు.అప్పుడు మీ తండ్రి చేసింది కూడా తప్పేనని ఒప్పుకోవాలని అన్నారు. చరిత్రను ఎవరూ మార్చలేరని చెప్పారు. తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని అడుగడుగునా కించపరిచే విధంగా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజలు ఇచ్చిన స్థానమేనని అందరూ గుర్తుంచుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

Related posts