telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

చెన్నై టెస్ట్‌ : భారీ స్కోర్‌ చేసి అలౌటైన ఇంగ్లండ్

చెన్నై వేదికగా ఇంగ్లండ్‌-ఇండియాల మధ్య తొలి టెస్ట్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఇంగ్లండ్‌ పట్టు బిగించినట్లే కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 578 పరుగులకు ఆలౌటైంది. 190.1 ఓవర్‌కు అశ్విన్‌… అండర్సన్‌ను బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆదివారం 555-8తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌ మరో 23 పరుగులు జోడించి ఆలౌటైంది. తొలుత బుమ్రా.. డొమ్‌ బెస్‌{34} ను ఎల్బీడబ్యూ చేయగా.. అండర్సన్‌ను అశ్విన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక శనివారం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ 218 పరుగులు, స్టోక్స్‌ 82 పరుగులతో అద్భుతంగా రాణించి జట్టుకు మంచి స్కోర్‌ అందించారు. ఇక భారత బౌలర్లలో అశ్విన్‌, బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. నదీమ్‌, ఇషాంత్‌ రెండేసి వికెట్లు తీశారు.

Related posts