telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక మాఫియాను ప్రోత్సహించింది లోకేశ్: మంత్రి మోపిదేవి

mopidevi venkataramana

టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించింది లోకేశ్ అని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఇసుకను రాజకీయం చేస్తే టీడీపీ నేత నారా లోకేశ్ మాట్లాడటం దౌర్భాగ్యమనిఆయన వ్యఖ్యలపై స్పందించాల్సి అవసరం లేదని చెప్పారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించింది లోకేశ్ అని ఆరోపించారు. ప్రతి రోజు కోట్లాది రూపాయల ముడుపులను తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఏం చేయాలో అర్థంకాక… ఇసుక అంశంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తే మంచిదని అన్నారు. విపక్షాలు ఇచ్చే సలహాలను స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేవారపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలను జారిచేశామని తెలిపారు.

Related posts