telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు భారత్ కు భారీ షాక్…

ravindra jadeja in 200 wickets club

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ జడ్డూ ఆడడం అనుమానంగానే మారిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీ20, వన్డేల సమయానికి జడేజా పరిస్థితిని సమీక్షించిన తర్వాత బీసీసీఐ సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారట. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడ్డేజా.. చివరి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. సూపర్‌ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి తొడ కండరాలు పట్టేశాయి. అయినా వేగంగా కోలుకుని రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అంతేగాక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో మరోసారి గాయపడ్డాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ విసిరిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. ఫ్రాక్చర్ అయిన జడేజా వేలుకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ నిర్వహించారు. అది సక్సెస్ అయింది. జడ్డూకు కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారొకరు తెలిపారు. టీమిండియా క్రికెటర్లు భారత్‌ చేరుకున్న విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా కూడా గుజరాత్ వెళ్లిపోయాడు. అయితే రిహాబిలిటేషన్ కోసం జడేజాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ పంపనుంది. అయితే గతంలో అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం జడ్డూకు విశ్రాంతి అవసరం అయిన నేపథ్యంలోనే అతడు టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడు ఆడేది లేదని సెలక్టర్లు తర్వాత నిర్ణయిస్తారు.

Related posts