గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ రంగానికి బహుముఖ సేవలందించారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంపై కేసీఆర్ స్పందించారు. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా, తమ అత్యుత్తమ సేవలు అందించినా బాలసుబ్రహ్మణ్యంను కాపాడలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.