యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో సీత పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రతినాయకుడు రావణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘ఆదిపురుష్’ సినిమాపై స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ పెద్ద పండగే అంటున్నారు కృష్ణంరాజు. అయితే ప్రభాస్ తో కలసి ‘బ్లవర్లీ హిల్స్’లో భోజనం చేయాలనేది కృష్ణంరాజు కోరిక అట. ”బ్లవర్లీ హిల్స్లో భోజనం అంటే.. అక్కడ ఓన్లీ హాలీవుడ్ స్టార్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందుకే అక్కడ ప్రభాస్తో కలిసి భోజనం చేయాలని ఉందనే కోరిక కోరాను. అందులో ప్రభాస్కి కూడా ఒక బిల్డింగ్ ఉండాలి. నేను అక్కడ ప్రభాస్తో కలిసి భోజనం చేయాలి. త్వరలోనే ఆ కోరిక తీరబోతోంది. ప్రభాస్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” రెబల్ స్టార్ కృష్ణంరాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు.
previous post
next post