telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహారాష్ట్ర హోంమంత్రికి కరోనా పాజిటివ్…

Corona

మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కేసులు మాత్రం తగ్గడం లేదు. కానీ మొదట్లో దేశవ్యాప్తంగా లక్ష వరకు చేరిన రోజువారి కేసులు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, కాస్త అజాగ్రత్తగా ఉంటేమాత్రం వెంటనే క్యాచ్ చేస్తోంది కరోనా.. సామాన్య ప్రజల నుంచి వీవీఐపీల వరకు ఎవరు? అనే తేడా లేకుండా అంటుకుంటోంది.. ఇప్పటికే భారత్‌లో పలువురు కేంద్రమంత్రులు, సీఎంలు, ఆయా రాష్ట్రాల మంత్రులు కరోనా బారినపడగా.. తాజాగా, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. సోషల్ మీడియా వేదికగా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.. తనకు క‌రోనా వైరస్ సోకిందని.. అయినప్పటికీ, ఆరోగ్యంగానే ఉన్నాన‌ని పేర్కొన్న అనిల్ దేశ్‌ముఖ్‌.. ఇటీవల తనను కలిసిన వారంద‌రూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను ఓడించి తిరిగి ప్ర‌జా సేవకు అంకితమవుతానని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇక, కోవిడ్ పాజిటివ్‌గా తేలిన మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. నాగ్‌పూర్‌లోని తన నివాసంలో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరి ఆయః కరోనా టీకా ఎప్పుడు తీసుకుంటారు అనేది చూడాలి.

Related posts