తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వగ్రామ సమస్యల పై దృష్టిసారించారు. తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఓ నివేదిక తయారు చేసి తనకు అందించాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు.
చింతమడకను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడివున్నానని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే తన అభిమతమని చెప్పారు. త్వరలోనే చింతమడకకు వచ్చి సమస్యలను స్వయంగా పరిశీలిస్తానని హంసకేతన్ రెడ్డికి కేసీఆర్ పేర్కొన్నారు.