కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిరుగుపాటి జయరాం హత్య కేసును ఏపీ పోలీసులు హైదరాబాద్కు బదిలీ చేశారు. నిందితులను తప్పించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆమె హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు.
జయరాం హత్య హైదరాబాద్లో జరగడంతో చట్ట ప్రకారం కేసును హైదరాబాద్కు బదిలీ చేశారు. జయరాం హత్య కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ లను మంగళవారం నందిగామ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు ఈ నెల 20 వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. నిందితులను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.