telugu navyamedia
రాజకీయ వార్తలు

రక్షణ దళాలకు కరోనా సోకకుండా చర్యలు: రాజ్‌నాథ్‌

Rajnath Singh inaugurates NIA office

రక్షణ దళాలకు కరోనా సోకకుండా అన్నీ చర్యలు తీసుకొంటున్నామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు.క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యతిరేకంగా జ‌రుగుతున్న పోరాటం అతిపెద్ద యుద్ధమని అన్నారు. ఈ సంక్షోభానికి వ్యతిరేకంగా భారత్ యుద్ధ ప్రాతిపదికన పోరాడుతోందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి కట్టుగా ప‌నిచేస్తున్నాయ‌ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

రక్షణ దళాల కదలికలను తగ్గించడం, సెలవులను పరిమితం చేయడం, వర్క్ ఫ్రమ్‌ హోం లాంటి చర్యలతో జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాజ్‌నాథ్ చెప్పారు.ఢిఫెన్స్ కంపెనీలు ఎన్ – 95 మాస్కులు, పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్‌ను తయారు చేస్తున్నాయని, త్రివిధ దళాలూ ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తున్నాయ‌ని ఆయ‌న‌ తెలిపారు.

Related posts