telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు ఢిల్లీలో చంద్రబాబు ఆందోళన

chandrababu fire on AP CS again

కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నెల 23న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో వివిప్యాట్లు లెక్కించాలంటూ రేపు ఢిల్లీలో చంద్రబాబు ఆందోళన చేయనున్నారు. గత వారం రోజులుగా బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసేందుకు జాతీయ నేతలతో వరుస భేటీలతో చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు.

తాజా రాజకీయ పరిణామాలను చర్చించేందుకు చంద్రబాబు ఈ రోజు సాయంత్రం మళ్లీ కోల్ కతా వెళ్లారు. కొద్ది సేపటి క్రితం కోల్ కతా చేరుకున్న ఆయన,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. మమతతో భేటీ అనంతరం,చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. వివిప్యాట్లు లెక్కించాలంటూ మంగళవారం చంద్రబాబు ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారు.

Related posts