telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సామాజిక

రాష్ట్రప్రజలకు .. ఏపీసీఎం చంద్రబాబు .. ఈస్టర్ .. శుభాకాంక్షలు ..

chandrababu on amaravati mla quarters

ఈస్టర్ పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏసుక్రీస్తు విశిష్టతలను వివరించారు. క్రీస్తు తన జీవితకాలంలో శాంతి, సోదరభావం, భద్రత, ఇతర మతాల పట్ల గౌరవం తదితరల అంశాల కోసమే పాటుపడ్డారని పేర్కొన్నారు. మానవవత్వంతో కూడిన శాంతియుత జీవనం క్రీస్తు ఎంచుకున్న మార్గం అని, ఆయన భోధించింది కూడా అదేనని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు, జీసస్ బోధనలు అందరూ అనుసరించాలని, ఆయనో గొప్ప మార్గదర్శకుడని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో క్రిస్టియన్ల కోసం అనేకరకాల పథకాలు తీసుకొచ్చిందని, రాష్ట్రంలో మత సామరస్యం కోసం పాటుపడ్డామని చెప్పారు. ఈస్టర్ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఉన్నవారితో పాటు దేశవిదేశాల్లో ఉన్న క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts