telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న ప్రజలు ఉండరు.. ఎందుకంటే…?

మనం చూసిన ఏ నగరం అయిన ప్రజలతో కిటకిటకాలాడుతున్నది.  నగరాల్లో జాగా సరిపోక చాలామంది శివరాల్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, తూర్పు మధ్యదరా సముద్రంలోని సైప్రస్ దీవిలోని ఫమగుస్టా అనే నగరం ఉన్నది.  సముద్ర తీరంలో ఉండే ఈ నగరంలో ఆకాశాన్ని తాకే భవనాలు ఉన్నాయి.  అన్ని వసతులతో అద్భుతంగా ఉంటుంది.  ఈ నగరంలో వరోషా పేరుతో ఓ ప్రాంతం ఉన్నది.  సముద్ర తీరంలో ఉండే ఈ ప్రాంతంలో అనేక భవనాలు ఉన్నాయి. రోడ్లు, చెట్లు ఉన్నాయి.  కానీ, ఆ ప్రాంతంలో ఒక్క మనిషి కూడా కనిపించడు.  నివసించడు.  ఆ ప్రాంతం చుట్టూ మూళ్ళ కంచెలు, బారీకేడ్లు పెట్టి ఉంటాయి.  నిత్యం సైన్యం, పోలీసులు పహారా కాస్తుంటారు.  1970 వరకు ఈ ప్రాంతం టూరిస్టులకు స్వర్గధామంగా ఉండేది.  దీనిపై టర్కీ కన్నేసింది.  అయితే, ఈ నగరంలో గ్రీస్ దేశానికీ చెందిన ప్రజలు అధికంగా నివసిస్తుంటారు.  1974లో టర్కీ సైన్యానికి, ఫమగుస్టా నగరంలోని గ్రీస్ ప్రజలకు మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది.  ఫమగుస్టా నగరంలోని వరోషా ప్రాంతం టర్కీ ఆధీనంలోకి వెళ్ళింది.  అప్పటికే అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడంతో ఇప్పటికి ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది.  

Related posts