హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తైందని చెబుతూ “దర్శకుడు హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్, నిర్మాతలు, హీరో వరుణ్ తేజ్తో పాటు చిత్ర బృందంతో అద్భుత క్షణాలు గడిపాను” అని అధర్వ ట్వీట్ ద్వారా తెలిపారు. అధర్వ ట్వీట్కి స్పందించిన హరీష్ శంకర్… “ఈ పాత్రను అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతలు సరిపోవు సర్.. మీ వైఖరి, నటన మా కెంతో నచ్చాయి” అని అన్నాడు. “స్క్రీన్పై మీ పర్ఫార్మెన్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం” అని రామ్ ఆచంట ట్వీట్లో తెలిపారు.
previous post