గత ఏడాది నుండి కరోనా మన దేశాన్ని వణికిస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసులు తగ్గుతాయి అనుకున్నారు. అలాగే మొదట్లో కేసులు తగ్గిన ఇప్పుడు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. ఇక ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు కరోనా సోకింది. అయితే… తాజాగా… బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. “ఇవాళ ఉదయమే నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం నేను హోం ఐసోలేషన్లో ఉంటున్నాను. వైద్యుల సలహాల మేరకు కరోనా నిబంధనలను నేను పాటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. త్వరలోనే నేనే కరోనా నుంచి కోలుకుంటాను” అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా.. ఇప్పటికే అలియా భట్, రణ్బీర్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
previous post