బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రిస్కీ స్టంట్స్ చేసి తన అభిమానులను ఆశ్చర్యపరుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అనేక సార్లు ఒఒళ్ళుగగుర్పొడిచే స్టంట్స్ చేసిన అక్షయ్ కుమార్ ఈ సారి హెలికాప్టర్ నుండి వేలాడుతూ వెరైటీ స్టంట్ చేశాడు. తాజాగా తన ట్విట్టర్లో ఓ ఫోటోని పోస్ట్ చేసిన అక్షయ్ “క్యాజువల్గా వేలాడాను. ఇలాంటి రిస్కీ స్టంట్స్ అభిమానులు ఎవరు చేయవద్దు. ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో ఈ స్టంట్స్ చేశాము” అని కామెంట్ పెట్టారు. అక్షయ్ పోస్ట్ చేసిన ఫోటోలో వేగంగా వెళుతున్న హెలికాఫ్టర్ నుండి క్రిందకి వేలాడుతూ బైక్ పై వెళుతున్న విలన్ ని వేటాడుతున్నట్టుగా ఉంది. ఈ స్టంట్ రోహిత్ శెట్టి, కాప్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం కోసం చేశారు. “సూర్యవంశీ” చిత్రాన్ని రోహిత్ శెట్టి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో కథానాయికలుగా కత్రినా కైఫ్ ఎంపికైంది. గత సంవత్సరం పాడ్ మాన్, గోల్డ్, 2.0, సింబా సినిమాలతో సందడి చేసిన అక్షయ్ 2019 లో “కేసరి” మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లక్ష్మీ బాంబ్, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్, గుడ్ న్యూస్ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు అక్షయ్.
previous post
దిశ ఘటన : ఎన్కౌంటర్పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు