telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేఏపాల్‌ పార్టీతో టీడీపీ పొత్తు : విజయసాయిరెడ్డి సెటైర్‌

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.  తాజాగా విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీ పార్టీని కేఏపాల్‌ ప్రజాశాంతి పార్టీతో పోల్చారు విజయసాయిరెడ్డి. “టీడీపీకన్నా కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ నయంలా ఉంది. హడావుడి చేసి నామినేషన్లు వేయకుండా పలాయనం చిత్తగిస్తుంది. పొత్తులేనిదే లేవడు – లేస్తే మనిషిని కాదంటాడు చంద్రబాబు. భవిష్యత్ లో ప్రజా శాంతి పార్టీకి ఎక్కువ సీట్లిచ్చయినా పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేస్తుందేమో!” అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతకు ముందుకు ట్వీట్‌లో “తుప్పు నిర్ణయాన్ని పప్పు స్వాగతిస్తాడా? కొందరు నాయకుల్లా వ్యతిరేకించి తుప్పును వదిలించుకుని కొత్త పార్టీ పెడతాడా? అసలు జెండా పీకేయమన్నదే పప్పా? ఇంతకాలం ఉప్పూ నిప్పులా తుప్పూ, పప్పూ ఉన్నారా? తండ్రీకొడుకుల ఆటలు పార్టీ పాలిట శాపం. కొంప దాటివస్తే ఎవర్ని తన్నాలో జనానికి క్లారిటీ ఉంది చిట్టి నాయుడూ! ఏ పార్టీకి అభ్యర్థుల్లేరో మీ ‘బాబు,’ తేల్చేశాడు. జనం మెచ్చిన నాయకుడెవరో, వెన్నుపోటుదారుడెవరో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికలు బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి మీ తండ్రీకొడుకులను ప్రజలే బహిష్కరిస్తారు చూస్కో.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Related posts