హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఖైరతాబాద్ నుంచి కూకట్పల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మరోవైపు అమీర్పేట్ నుంచి గౌలిగూడ వరకు గురునానక్ రథయాత్ర సాగుతోంది. భక్తుల రద్దీతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి పంజాగుట్ట మీదుగా పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు.
అపవిత్ర కూటమికి.. అవినీతి సర్కార్ కు ముగింపు: బీజేపీ