telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సచివాలయంలో ఏపీ మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగింపు

AP Ministers name plates remove secretariat |

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరనుంది.ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. నిన్న చంద్రబాబు రాజీనామాతో టీడీపీ ప్రభుత్వం రద్దయింది.

దీంతో సచివాలయంలోని మంత్రుల చాంబర్ల ముందున్న నేమ్ ప్లేట్స్ తొలగించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరిపాలన శాఖ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది మంత్రులు పేషీల్లో నేమ్ ప్లేట్స్ తొలగించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ ల చిత్ర పటాలను తొలగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత నూతనంగా వచ్చే మంత్రుల పేర్లతో నేమ్ ప్లేట్స్ రాయిస్తామని అధికారులు వెల్లడించారు.

Related posts