కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను పూర్తిగా నియంత్రించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ మేరకు టోక్యో, ఒసాకాతో పాటు మరో ఐదు నగరాల్లో ఎమర్జెన్సీని విధించింది. అయితే ఇప్పటికే మాల్స్, సినిమా థియేటర్లు, బార్లు, పబ్బులు మూసివేశారు.
కాగా బ్యాంకులు, సూపర్ మార్కెట్లు ఓపెన్ చేసి ఉంటాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ ఎమర్జెన్సీ నెలరోజుల పాటు ఉంటుందని ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని జపాన్ ప్రధాని షింజో అబే పిలుపునిచ్చారు. ఇప్పటికి జపాన్లో 4వేలకు కోవిడ్ కేసులు ఉండగా 92 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రైతు బంధు చెక్కులు రాలేదు.. రుణ మాఫీ ఊసే లేదు: ఉత్తమ్