telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల దర్నా

sub staff notification in andhrabank

ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టారు. విశాఖపట్టణం సీతమ్మధార ఆంధ్రా బ్యాంక్ రీజినల్ కార్యాలయం వద్ద సీపీఎం, సీపీఐలు సంయుక్తంగా నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు ఆంధ్రాబ్యాంక్‌ను విలీనం చేయవద్దని నినాదాలు చేపట్టారు. ప్లకార్డుల ప్రదర్శన బ్యాంక్ విలీనం ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడానికి వ్యతిరేకంగా ఒంగోలులో వామపక్షాలు నిరసన తెలిపాయి. నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఆంధ్రా బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎం.ఎల్.నారాయణ, పూనాటి ఆంజనేయులు నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.

Related posts