telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రాజకీయ కక్ష్య సాధింపుల్లో భాగంగానే టీడీపీ నేతలపై కేసులు…

జేసీ వారి అబ్బాయి కూడా తమ ఫ్యామిలీ కోవలో చేరారు.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు, టీడీపీ నేత జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు… టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయడంపై తీవ్రంగా స్పందించిన ఆయన.. రాజకీయ కక్ష్య సాధింపుల్లో భాగంగానే టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని.. బీసీ నేతలను సైతం టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.. సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉన్న సౌమ్యుడైన మాజీ మంత్రి కళా వెంకట్రావుపై కేసులు పెడతారా? మచ్చలేని నేతలను కూడా అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్ జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి.. టీడీపీ నేతలను జైలుకు పంపుతున్నారని విమర్శించారు.. బీసీల పేరు చెప్పుకుని రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డ ఆయన.. ప్రతీ రంగంలో వైసీపీ సర్కార్‌ విఫలం అయ్యిందన్నారు. 30 ఏళ్లు ఏపీలో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి రాజ్యం కావాలంటే చెప్పండి… మేం తప్పుకుంటామని వ్యాఖ్యానించారు. ఇక, రాష్ట్ర మంత్రులకు తిట్టడం తప్ప వేరే పనిలేదంటూ సెటైర్లు వేసిన పవన్‌ రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే.. జగన్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చూడాలి మరి ఈ యువ నాయకుడి మాటలపై ఎవరు ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Related posts