పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత వైమానికి దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున 3 గంటలకు జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. 1000 కేజీల బాంబులతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసింది.
మరో వైపు భారత వాయుసేన జరిపిన బాంబు దాడులపై పాకిస్థాన్ స్పందించింది. భారత విమానాలు నిబంధనలను ఉల్లంఘించి తమ సరిహద్దుల్లోకి వచ్చిన మాట వాస్తవమేనని, పాక్ వైమానిక దళాలు తిప్పికొట్టాయని ప్రకటించింది. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జెనరల్ అసిఫ్ గఫూర్ స్పష్టం చేశారు. భారత వాయుసేన దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్థిక, రక్షణ శాఖతో ఆయన చర్చిస్తున్నారు. ఇక వాయుసేన దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానికి వివరించారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
యురేనియం తవ్వకాలపై చంద్రబాబు ఫైర్