telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కార్టూన్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

MIM Comments MP Elections
ఎన్నికల సంఘాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ ప్రదర్శించిన ఓ కార్టూన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ఓవైసీ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ  పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. 
కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధృతరాష్ర్టుడితో, ఈఆర్‌వో, డీఈవో, సీఈవోలను దుశ్శాసనుడితో, ఓటర్లను ద్రౌపదితో పోల్చుతూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇదే బ్యానర్‌లో సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ ఫోటోలను కూడా ఉంచారు. ఈ కార్టూన్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ, నూతనంగా నియమితులైన జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై ఎవరైనా ఇలాంటి కార్టూన్‌లు వేస్తే ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు. ఘోరంగా ఓటమి పాలైన కాంగ్రెస్ ఇలాంటి కార్టూన్లకు తెరలేపిందని ఓవైసీ మండిపడ్డారు.

Related posts