telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత వ్యవహారాలు: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు

Ramachander rao bjp mlc

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కామారెడ్డిలో గురువారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత వ్యవహారాలు కొనసాగుతున్నాయని అన్నారు.

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగనున్నాయని వెల్లడించారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బొగ్గు గనుల శాఖ స్వతంత్ర డైరక్టర్‌ మురళీధర్‌ గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts