యురేనియం తవ్వకాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డలో జరుగుతున్న యురేనియం తవ్వకాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆళ్లగడ్డ మండల కేంద్రం నుండి గాజులపల్లి వరకు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ) సంస్థ యురేనియం కోసం తవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం తెలిసీ తెలియనట్టు ఉండటమేంటని ప్రశ్నించారు.
యురేనియం తవ్వకాలను నిరసిస్తూ విజయవాడలో ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీ నేతలు హాజరుకాకపోవడం వెనుక ఆంతర్యమేంటి? అని నిలదీశారు. రేపు ఆదివారం ఓబులంపల్లిలో జరిగే అఖిలపక్ష పోరాటానికి వైసీపీ మద్దతు ఉందా లేదా? అని ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి నల్లమల అటవీ ప్రాంతానికి ముప్పు తెచ్చారని విమర్శించారు.
రాహుల్, లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: మంత్రి ఎర్రబెల్లి