telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తహశీల్దార్ సజీవ దహనం ఘటన.. లొంగిపోయిన నిందితుడు!

vijaya tahasildar

తహశీల్దార్ ఆఫీస్ లోనే ఓ దుండగుడు పెట్రోల్ పోసి తహశీల్దార్ విజయపై నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయ స్పాట్ లోనే చనిపోయారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని సురేశ్ గా గుర్తించారు. గౌరెల్లి గ్రామవాసిగా అతన్ని గుర్తించారు. ప్రస్తుతం హయత్ నగర్ పోలీసులు అదుపులో హంతకుడు ఉన్నాడు.

తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో విజయను తగలబెట్టిన తర్వాత… సురేష్ తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. కాలిన గాయాలతో ఉన్న అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హత్యకు గురైన విజయారెడ్డి స్వగ్రామం శాలిగౌరారం మండలం పెరకకొండారం. మరోవైపు, విజయ హత్యపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Related posts