తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ 22న తొలివిడత నోటిఫికేషన్ విడుదలవుతుంది. మొత్తం 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది.. . మొదటి విడుతలో భాగంగా 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడుత నోటిఫికేషన్ ఏప్రిల్ 26న విడుదల కానుంది. రెండో విడుతలో భాగంగా 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30న మూడో విడుత నోటిఫికేషన్ విడుదల కానుంది. మూడో విడుతలో భాగంగా 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు మే 14న పోలింగ్ జరగనుంది.
400 మంది వరకు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 6,540 ఉండగా.. 600 మంది వరకు ఓటర్లున్న కేంద్రాలు 25,467 ఉన్నాయి. మొత్తం 32,007 పోలింగ్ కేంద్రా ల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్లుగా 64,014 మందిని నియమించారు. అదేవిధంగా 400 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రానికి ముగ్గురు, 600 మంది ఓటర్లున్న కేంద్రాలకు నలుగురు చొప్పున 1,21,488 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మే 23 తర్వాతే ఈ ఎనీకల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
హైకోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: శ్రీధర్ బాబు