telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … ట్యాంక్‌ బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ చేస్తామంటున్న .. కోదండరామ్..

kodandaram protest on inter students suicide

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షలు, రాస్తారోకోలు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘సకల జన భేరి’లో కోదండరామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్యాంక్‌ బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చిన్న, చిన్న కారణాలు చూపి కార్మికుల ఇంక్రిమెంట్లు తగ్గిస్తున్నారని, వారి వేతనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయన్నారు.

కార్మికులు జీతాలు పెంచమని కోరడం లేదు.. ఆర్టీసీని బతికించమని కోరుతున్నారని కోదండరామ్ తెలిపారు. ఆర్టీసీకి రావాల్సిన బస్సు పాసుల రాయితీలు చెల్లించాలని కోరుతున్నారని వివరించారు. కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.

Related posts