telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ సిద్ధమైతే తయారీకి ప్రభుత్వ సాయం!

corona vaccine

వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ కమిటీతో భారత ఫార్మా కంపెనీలు సమావేశమైనాయి. ఈ సమావేశంలో ఐదు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ పురోగతిని వివరించాయి. దేశంలో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను, జైడస్ కాడిలా సంస్థ జైకోవిడ్ ను తయారు చేసేందుకు సిద్దమవుతున్నాయి.

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు తయారు చేసిన వ్యాక్సిన్ ను అందించనుంది. ఈ మూడింటితో పాటు బయోలాజికల్ ఈ, జెన్నోవా బయో ఫార్మాస్యుటికల్స్ కంపెనీలు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నాయి.కేంద్రం తరఫున ఫార్మా కంపెనీలకు ఏదైనా సహాయం అవసరమైతే చేసేందుకు సిద్ధమేనని కమిటీ హామీ ఇచ్చింది.

వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేందుకు సాయం చేస్తామని పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీ విషయమై డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయాలని గతంలో కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, విదేశాంగ, బయో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతినిధులతో పాటు ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఐసీఎంఆర్, వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.

Related posts