telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి: నాదెండ్ల

Nadendla baskar rao

కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కర్‌రావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నాదెండ్లనుఅమిత్‌షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ, తెలంగాణల్లో భవిష్యత్ బీజేపీదేనని నాదెండ్ల చెప్పారు.తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. రాజకీయాల్లో వయసుతో పనిలేదని, మనసు ఉత్సాహంగా ఉండాలన్నారు.

దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిందని, బంధు ప్రీతి, కుల అభిమానం పెరిగిందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ హయాంలోనే బీజేపీలో చేరాలనుకున్నానని, అయితే మోదీ, అమిత్ షా పిలుపు మేరకు పార్టీలో చేరానని భాస్కర్‌రావు అన్నారు. పార్టీ కోసం ఏపీ అంతటా తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని ఆయన పేర్కొన్నారు.

Related posts