తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు తేదీ ఖరారైంది. ఈ నెల 30 నుంచి నవంబర్ 9 వరకు ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల టైంటేబుల్ను సోమవారం సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం www.telanganaopenschool.org వెబ్ సైట్ ను లాగిన్ అవ్వాలని తెలిపారు.