telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలకు .. జిల్లా జడ్జిలుగా పదోన్నతి…

AP

రాష్ట్ర ప్రభుత్వం 16 మంది సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలకు జిల్లా జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల 21 మంది జిల్లా జడ్జిల నియామకాలు చేపట్టింది. వీటిలో 65శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్దేశిత కోటా మేరకు పదోన్నతులు చేపట్టారు. అర్హత కలిగిన 16 మంది సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలతో హైకోర్టు రిజిస్ట్రార్ల ప్యానల్ జాబితాను రూపొందించి గవర్నర్‌కు పంపారు.

దీన్ని పరిశీలించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాబితాను యథాతథంగా ఆమోదించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

Related posts