telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వచ్చే నెల 5న విడుదలకు సిద్ధమవుతున్న జాంబి రెడ్డి…

Zombie-Reddy

తెలుగు చిత్రసీమలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారి జాంబీల కాంసెప్ట్‌తో తెరకెక్కుతోంది జాంబి రెడ్డి సినిమా. తేజ సజ్జా హీరోగా తెరకెక్కతున్న సినిమా జాంబి రెడ్డి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇందులో తేజ సజ్జాతో పాటుగా ఆనంది, దాక్షానగార్కర్‌లు ప్రధాన పాత్రలుగా చేస్తున్నారు. అంతేకాకుండా రఘుబాబు, పృథ్వీరాజ్, హర్షవర్దన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంపొందించాయి. ఈ సినిమాలో కరోనా మహమ్మారి, జాంబీలు ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఈ చిత్రం కర్నూల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా మేకర్స్ ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ అంటూ అందరినీ ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాను వచ్చే నెల 5న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ జాంబిరెడ్డిని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా రాజశేఖర్ నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా.. లేదా అనేది .

Related posts