telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు: లక్ష్మీపార్వతి

laxmi parvathi ycp

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ప్రశంసించారు.మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆమె హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లకు దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారని ఆమె అన్నారు.

Related posts